Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా మంగ ళవారం మండలంలోని రహదారుల వెంట ముళ్ల చెట్లపొదలను తొలగిస్తూ, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్లచెట్లను తొలగించారు. గవిచర్ల-తీగరాజుపల్లి వరకుగల నెక్కొండ రహదారి చుట్టుపక్కల ఉన్న చెట్ల పొదలను జేసీబీ సహాయంతో ఎస్ఐ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. రెండు రోజులుగా మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న రహదారుల వెంట చెట్లపొదలను తొలగిస్తూ ప్రజల సౌకర్యార్థం శుభ్రం చేస్తున్నారు. దీంతో ప్రజలు పోలీసుల సేవలను ప్రశంసిస్తున్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై ప్రియదర్శిని, హెడ్ కానిస్టేబుల్ యుగంధర్, కానిస్టేబుల్ కుమారస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.