Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేక బావిలో పడి మహిళ బాసాని భాగ్యలక్ష్మి (58) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం శాయంపేట గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం. భాగ్యలక్ష్మికి కొంత కాలంగా మానసిక స్థితి బాగా లేనందున హన్మకొండలోని మానసిక వైద్యుల వద్ద చికిత్స చేయించుకుంటుంది. ఈ క్రమంలో గత మూడు రోజుల క్రితం హన్మకొండలోని తన కూతురు కోడెం సత్య శ్రీ ఇంటి వద్ద ఉంటూ చికిత్స జరిపించుకుంటున్నారు. తిరిగికి మంగళవారం శాయంపేటకు వచ్చారు. భాగ్యలక్ష్మికి కడుపు నొప్పి రావడంతో మందులు తీసుకురావడానికి నరసింహరాములు మెడికల్ షాప్కు వెళ్లివచ్చి చూడగా తన భార్య కనిపించలేదు. చుట్టుపక్కల ఇళ్లలో వెతికినా ఫలితం కనిపించలేదు. అనుమానంతో తన ఇంటి వెనుక ఉన్న బావిలో చూడగా భాగ్యలక్ష్మి శవమై తేలి కనిపించింది. మానసిక స్థితి బాగా లేనందున బావిలో పడి తన భార్య మరణించిందని మృతురాలి భర్త నరసింహారాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ప్రొబేషనరీ ఎస్ఐ సుమలత తెలిపారు.