Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియా అదనపు కbతీషనర నాగేశ్వర్
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని బల్దియా అదనపు కమీషనర్ సి.హెచ్.నాగేశ్వర్ అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజా వాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలో అదనపు కమీషనర్ పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అకౌంట్స్ విభాగం నుంచి 1, టౌన్ ప్లానింగ్ 13, ప్రజారోగ్యం 10, సాధారణ పరిపాలన విభాగం నుంచి 1, పన్నుల విభా గం 6, ఇంజినీరింగ్ విభాగం 13, మొత్తం 44. ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం ఫిర్యాదులను పరిష్కార నిమిత్తం వివిధ విభాగాల అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటిజన్ బడ్డి ఆప్లో 2770 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని, తక్షణమే విభాగాధి పతులు పరిష్కారదిశగా కషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ వెంకన్న, డి.ఎఫ్.ఓ. కిషోర్, డిప్యూటీ కమీషనర్ లు జోనా, రవీందర్ యాదవ్, హెచ్ఓ ప్రిసిల్లా పాల్గొన్నారు.