Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ఉద్యోగ నియామకాల కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న ప్రగతి భవన్ను ముట్టడిస్తామని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఎన్నికలు వస్తేనే నిరుద్యోగులు, ఉద్యోగాలు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ ముట్టడిని జయప్రదం చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో ములుగు టౌన్ కన్వీనర్, కో కన్వీనర్ నాగరాజు, వేణు, నాయకులు చంటి, సాగర్, తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో మహ్మద్ రజాక్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రావుల రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల, నిరుద్యోగ యువత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తక్షణమే ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేయాలని, అప్పటివరకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు జంగా మునీందర్, కొండల్, మహేష్, కపిల్, లక్ష్మీనారాయణ, వెంకన్న, రవి, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయికుమార్, డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి మసాజీ మాట్లాడారు. ప్రగతి భవన్ ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సురేష్ బాబు, ప్రసాద్, సాయి తదితరులు పాల్గొన్నారు.