Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పొలం రాజేందర్
నవతెలంగాణ-మహాముత్తారం
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని డీవైఎఫ్ఐ జయశంకర్ జిల్లా అధ్యక్షుడు పొలం రాజేందర్ అన్నారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం వెళ్తున్న నాయకులను శుక్రవారం పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతూ దొరల పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలను నూతన పథకాలు భ్రమలో పెడుతూ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని నిరు ద్యోగులకు నిరుద్యోగ భతి అందించాలని వెంటనే పాఠశాలలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేందర్, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.