Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి
నవతెలంగాణ-శాయంపేట
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి అన్నారు. పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్ లో గురువారం రాత్రి పరకాల ఏసీపీ గా విధు లు నిర్వర్తించిన శ్రీనివాస్ ఉద్యోగరీత్యా బదిలీపై వెళ్లడంతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శాయంపేట ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, సర్పంచ్ కందగట్ల రవి, ఎంపీటీసీ భాసాని చంద్రప్రకాశ్, పరకాల రూరల్ సిఐ తొగిటి రమేష్ కుమార్, శాయంపేట ఎస్ఐ అక్కినపల్లి ప్రవీణ్ కుమార్, సిబ్బంది ఏసీపీ శ్రీనివాస్ను శాలువా పూలమాలలతో సత్కరించారు.