Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపూర్
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ సులువని ములుగు సీఐ గుంటి శ్రీధర్ అన్నారు. మండలంలోని వెల్తుర్లపల్లి క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం సీఐ శ్రీధర్, ఎస్సై రమేష్ ప్రారంభించి మాట్లాడారు. పోలీసులతో ప్రజలు స్నేహంగా ఉంటూ నేరాల నియంత్రణకు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాల వల్ల గణపురం, ములుగు, వెంకటాపుర్ మండలాల నుంచి ప్రయాణించే వాహనాల వివరాలు ఎప్పటికప్పుడు నమోదౌతాయని చెప్పారు. నేరాలను నియంత్రించే లక్ష్యంతో అన్ని గ్రామాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు సహకరించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య, నారాయణగిరిపల్లి సర్పంచ్ మాడ ప్రకాష్, పోలీసులు పాల్గొన్నారు.