Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరుగురితో సమన్వయ కమిటీ ఎన్నిక
సంస్థాగత షెడ్యూలు విడుదల
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ నియోజకవర్గంలో ఈనెల 2న జెండా పండగ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు టీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ప్రకటించారు. మహబూబాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారంఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు మార్నేని వెంకన్న, డాక్టర్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, పరకాల శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలో సంస్థాగత ఎన్నికలను విజయవంతం చేయడం కోసం ఎమ్మెల్యే శంకర్నాయక్ నేతత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈనెల 2న గ్రామ, పట్టణ, వార్డులో జెండా పండగ నిర్వహించాలని చెప్పారు. అలాగే 2 నుంచి 12 వరకు గ్రామ, పట్టణ, వార్డు కమిటీలను నియమించాలని తెలిపారు. అనంతరం 12 నుంచి 20 వరకు మండల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సమన్వయ సమితి కమిటీ సభ్యులు భీరవెల్లి భరత్కుమార్రెడ్డి, మర్రి రంగారావు, భూక్య బాలాజీ నాయక్ పాల్గొన్నారు.