Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేవాలయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్
నవతెలంగాణ-రఘునాథపల్లి
దేవాదాయశాఖకు సంబంధించిన స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని దేవాలయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ హెచ్చరించారు. సోమవారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని రెండెకరాల దేవస్థానాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆర్టీసీ స్థలానికి పోను మిగతాది దేవాదాయ శాఖకు సంబంధించిందని వెల్లడించారు. దేవస్థానంలో ఎవరైనా డబ్బాలు ,దుకాణాలు పెట్టుకుంటే వెంటనే తొలగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో శేషు భారతి, తదితరులు పాల్గొన్నారు.