Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలోని శ్రీ ఉమ చంద్రశేఖరస్వామి ఆలయంలో నాల్గో రోజు ఆదివారం అమ్మవారు లక్ష్మీదేవి అలంకారంలో సందర్శకులకు దర్శణమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు రూ.50 వేలతో అమ్మవారిని అలంకరించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు విస్సావజ్జల నరేష్ శర్మ తెలిపారు. మహిళలు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. అనంతరం సందర్శకులకు ఆలయ కమిటీ ఆద్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు.