Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే సీతక్క, ఏఎస్పీ సాయి చైతన్య
విగ్రహ ఆవిష్కరణ
నవతెలంగాణ-ములుగు
బతుకమ్మ పండుగ అందరి ప్రజల కుటుంబాల్లో వెలుగులు నింపిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. సర్పంచ్ బండారి నిర్మల హరినాధం ఆధ్వర్యంలో తోకుంట కట్టపై ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే సీతక్క, ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య ముఖ్యఅతిథులుగా హాజరై గురువారం ఆవిష్కరించారు. అనంతరం సీతక్క మాట్లాడారు. బతుకమ్మ పండుగ అందరి కుటుంబాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాంద్ పాషా, ఉపసర్పంచ్ సుమలత, పట్టణ అధ్యక్షుడు వంగ రవి యాదవ్, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి అజ్జూ, తదితరులు పాల్గొన్నారు.