Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటర్రెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
రైతు చట్టాల పట్ల టీఆర్ఎస్ తన వైఖరిని స్పష్టం చేయాలని సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పసరలో ధాన్యం రాశులను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని మార్కెట్కు తీసుకువస్తున్నా కొనుగోలు కేంద్రాలు కేంద్రాలు ప్రారంభించకపోవండంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేసీఆర్కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే నూతన చట్టాల రద్దు కోసం వారు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనాలని, లేకుంటే ఆందోళలను చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి, పొదిల చిట్టిబాబు, జిల్లా కమిటీ సభ్యులు గుండు రామస్వామి, అంబాల పోషాలు తదితరులు పాల్గొన్నారు