Authorization
Wed March 12, 2025 10:07:30 am
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని పోలిస్స్టేషన్ సమీపంలో గత మంగళవారం నుండి కాటారం మండలం కేంద్రానికి చెందిన గంట గీత బిడ్డతో ఒంటరిగా ఉంటోంది. గమనించిన స్థానికులు సఖి నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సఖి సిబ్బంది అక్కడివెళ్లి బాధితురాలి సమస్య తెలుసుకుని సఖి సెంటర్కు తీసుకొచ్చారు. సఖి కేంద్రం అండగా ఉంటుందని బాధితురాలికి మనోదైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ క్యాతం గాయత్రి, కేస్ వర్కర్ పోత మాధవి, అకౌంటెంట్ కౌటం కృష్ణ, ఐటీ గోపు తిరుపతి, పాల్గొన్నారు.