Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ-బయ్యారం
ఇల్లందు నియోజకవర్గ మహిళ నాయకురాలు, గార్ల మండలంలోని సీతంపేట ఎంపీటీసీ గుండెబోయిన నాగమణి దిష్టిబొమ్మను సీతంపేట గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు దహనం చేయడం మూర్ఖత్వమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగమణి మూడేండ్లుగా ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడుతున్నట్టు తెలిపారు. ఓర్వలేకనే టీఆర్ఎస్ నాయకులు నాగమణి దిష్టిబొమ్మ దహనం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 30 వరకు దిష్టిబొమ్మలు దహనం చేయడం నిషేధమైనా అందుకు భిన్నంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.