Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
అభ్యుదయ సేవా సమితి, గర్ల్స్ అడ్వకసీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో మంగళవారం బాల్యవివాహాల నిర్మూలన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. చిన్న వయసులో తల్లిగా మారితే పుట్టిన బిడ్డకు తల్లికి ప్రమాదాలు ఎదురవుతాయన్నారు. బాల్య వివాహాలు వలన జరిగే నష్టాలను వివరించారు. వారికి అవకాశాలు కల్పిస్తే ఉన్నత స్థాయిలోకి వస్తారని పేర్కొన్నారు. పోలీస్ అధికారి అనిల్, సీడబ్య్లూసీ మాజీ చైర్మన్ మండల పరశురాములు తదితరులు పాల్గొన్నారు.