Authorization
Sun February 23, 2025 02:58:01 am
- డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్
నవతెలంగాణ- ములుగు
వెంకటాపూర్ మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లోని ప్రజలు పత్తి నిల్వలపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఎ డాక్టర్ క్రాంతికుమార్ సూచించారు. మంగళవారం వెంకటాపూర్ మండలకేంద్రంలో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయగా ఆయన హాజరై ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తు లతోపాటు వివిధ రకాల అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి వైద్యపరీక్షలు నిర్వహించి మం దులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ పత్తికి సరైన మద్దతు ధర రాకపో వడంతో తమతమ ఇళ్లలోనే పత్తిని నిల్వ చేయడం వల్ల పురుగులు పత్తిలో ఉంటాయని, వాటి వల్ల మనుషులకు దద్దుర్లు, గోకుడు వంటి చర్మ సమస్యలు వస్తాయని, వాటికి ప్రజలు దూరంగా ఉండాలని సూచిం చారు. శిబిరంలో వైద్యులు చీర్ల శ్రీకాంత్, లోకప్రియ, పీహెచ్ఎన్ శోభ, ఏఎన్ఎంలు స్వప్న, కనకలక్ష్మి, ఆశాలు సరోజన, మాదవి, సౌజన్య, కవిత, సంపూర్ణ, శోభ, ఇందిర, తదితరులు పాల్గొన్నారు.