Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
జిల్లాలో క్రూషియల్ ఫండ్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను నెలరోజుల్లోగా పూర్తి చేయాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ నీటి సరఫరా సంస్థ, పంచాయతీ రాజ్, సర్వశిక్షా అభియాన్ అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. అత్యవసర నిధులతో చేపట్టిన గ్రామ పంచాయతీ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ, పాఠశాలల భవన నిర్మాణం, సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్స్, నీటి సరఫరా, తదితర అత్యవసర పనులు గ్రామాల్లో ఏ మేరకు జరుగుతున్నాయని మండలాలవారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి చేసిన క్రమంలో వెంటనే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. మంజూరై మొదలుకాని పనుల జాబితాను అందజేస్తే వాటిని రద్దు చేయిస్తామన్నారు. పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.