Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యంగా టీమాస్ ఫోరమ్ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నామని టీమాస్ ఫోరమ్ రాష్ట్ర నాయకులు ఉడుత రవి అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని, దళితులకు సీఎం పదవీ, మూడేకరాల భూమి, డబుల్బెడ్రూమ్ ఇండ్లు తదితర హామీలిచ్చి విస్మరించారని విమర్శించారు. వచ్చే ఏడాది నుంచి ఇస్తానంటున్న నాలుగు వేల రూపాయలను ఇప్పుడే ఇవ్వాలని, అలాగే పండించిన పంటలకు రైతులే ధర నిర్ణయించే పరిస్థితి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు 200 ప్రజాసంఘాలతో టీమాస్ ఫోరమ్ ఆవిర్భావ సభ ఏర్పాటు చేశామన్నారు. సామాజిక తెలంగాణ కోసం అన్ని సబ్బండ వర్గాలను ఏకం చేస్తామని తెలపారు. మండల కేంద్రంలో ఆదివారం మండల సభకు రాష్ట్ర కమిటీతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని అన్నారు.