Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీపీ సంజీవరావు, డీసీపీ వెంకన్న
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్
పోలీస్శాఖ పెట్టిన నిబంధనలను వినాయకచవితి సందర్భంగా ఎవరైనా అతి క్రమిస్తే చర్యలు తప్పవని ఏసీపీ సంజీవరావు అన్నారు. మండలంలోని ఏసీపీ కార్యాలయంలో సీఐ నరేందర్తో కలిసి గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఘన్పూర్, చిల్పూర్ మండలాలలో దాదాపు రెండు వందల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారని తెలిపారు. దీనికి స్టేజీలు వేసేముందు రోడ్డుకు అంతరాయం కలుగకుండాచూడాలని మసీదులు, చర్చీ, దేవాలయ స్థానాలలో అనుమతి లేకుండా పెద్దగా మైకులు ఉపయోగించరాదని సూచించారు. విద్యుత్ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలని, డీజేకు అనుమతులు లేదని, కమిటీలను వేసి దానికి సంబంధించిన బాధ్యులను పోలీస్స్టేషన్లో సెల్నెంబర్ ఇవ్వాలని అన్నారు. రాత్రి 10 తరువాత ఎటువంటి మైక్ సౌండ్స్ ఉపయోగించరాదని, మధ్యం, పేకాట లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక నిమజ్జన స్థలాలను రూటు ముందుగా తెలియజేయాలని ఆయన తెలిపారు. ఇలాంటి నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో చిల్పూర్ ఎస్సై కరుణాకర్, ఖలీం పాల్గొన్నారు.
కొడకండ్లలో..
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలనే పూజించి వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించాలని హైస్కూల్ ప్రధానోపాద్యాయుడు వీరేశలింగం అన్నారు. పాఠశాలలో మట్టి విగ్రహాలను విద్యార్థులతో తయారు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా అందరూ మట్టి విగ్రహాలను వినియోగించాలన్నారు.
జనగామలో..
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ వెంకన్న అన్నారు. వినాయక చవితి సందర్భంగా నేడు పట్టణంలో ప్రతిష్టించే గణేష్ విగ్రాహల ఏర్పాటు మండపాలను గురువారం ఏసీపీ పద్మనాభారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ అనుమతులు లేకుండా జిల్లాలో మండపాలు ఏర్పాటు చేయరాదని, చేసినా వెంటనే పోలీసులకు సమాచారం అంధించాలని ఆయన తెలిపారు. మండపంతో పాటు వారం రోజులు వాడుకునే విద్యుత్కు అనుమతులు తీసుకోవాలన్నారు.