Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామటౌన్
సెర్ప్ సంస్థలో పనిచేస్తున్న మండల స్థాయి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం వెంకటేశ్వర్లు, కె జ్యోతి అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పని చేస్తున్న అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్లు, తదితర ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం డీఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న దీక్షలు గురువారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. కనీస వేతనాలు అమలు చేయాలని సెర్ప్హెచ్ఆర్ వర్తింపజేయాలని కోరారు. ఆరోగ్య భద్రత, బీమా కల్పించి హెల్త్కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు అరుణ్ కుమార్, మహేందర్, జ్యోతి, అరుణ, శ్రీలత, రాజమహేశ్వర్రెడ్డి, రవీందర్, పద్మ, గీత, సోమ్లానాయక్ పాల్గొన్నారు.