Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలను నీటితో నింపాలని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మొకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని ఆ పార్టీ కార్యాలయంలో పంపర మల్లేషం అధ్యక్షతన గురువారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వర్షాబావ పరిస్థితుల వలన పంటలు ఎండిపోయాయని వాటికి నష్టపరిహారం అందిచాలని అన్నారు. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ద్వారా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయి, అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నివారించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్టుగా ప్రచారాలకే పరిమితమవుతున్నది తప్ప ఆదుకున్న దాఖాలాలు లేవని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతు అవార్డు రావడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి రైతు ఎలా అవుతారో అర్థం అవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పొత్కనూరి ఉపేందర్, సీనియర్ నాయకులు అంబటి సత్యనారాయణ, రమావత్ మీట్యానాయక్, సాంబరాజు దుర్గాప్రసాద్, లక్ష్మినర్సింహారెడ్డి, సాధం జంపన్న, బి శ్రీరాములు, నర్సింహా పాల్గొన్నారు.