Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టిసారించాలని వరంగల్ జేడీఏ ఉషాదయాళ్ అన్నారు. మండలంలోని రేలకుంట గ్రామపంచాయతీ ఆవరణంలో ఏవో పరమేశ్వర్ ఆధ్వర్యంలో రైతు సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేడీఏ ఉషాదయాళ్ హాజరై మాట్లాడుతూ రైతులు నిప్పం పథకంలో భాగంగా మిరప సాగు చేయాలని రైతులు నారుమడి దశలో సుడోమోనస్, సైకొడెర్మా మందులతో విత్తనశుద్ధి చేసే విధానాన్ని వివరించారు. పత్తి రైతులు తప్పనిసరిగా శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలు పాటించి తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందాలన్నారు. రేలకుంట గ్రామరైతులకు సబ్సిడీ ద్వారా మిరప పౌడర్ తయారు చేసే యంత్రాన్ని సరఫరా చేస్తామన్నారు. పత్తి రైతులు పురుగు మందులు, ఎరువులు తగిన మోతాదులో వాడుకుని పెట్టుబడులను తగ్గించుకోవాలని సూచించారు. రైతులు వ్యవసాయ ప్రారంభదశలో వారికుండబడిన భూములను భూసార పరీక్షలు చేయించుకున్నట్లయితే ఏ పంటలు వేస్తారో అధికారులు తెలుపుతారని, దిగుబడులను పెంపొందించుకోవచ్చని సూచించారు. మండలంలోని నందిగామ, రేలకుంట, రంగాపురం గ్రామాల్లో మిర్చిపంట సాగు చేస్తున్నందునా ప్రభుత్వం ప్రోత్సహిం చేందుకు తాము కృషి చేస్తామ న్నారు. ఈ సందర్భంగా రేలకుంట గ్రామంలోని 5ఎకరాలను ప్రభుత్వం ద్వారా సాగుచేసే ందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీహెచ్ఎస్వో సునీత, డీడీఅండ్ఐటీఎంఏ శివప్రసాద్, నర్సంపేట ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ఎం సారంగం, డీపీఎంపీ రాంచందర్, ఎంఏఎన్ఎస్జీ వినరు, ఎన్ఐబీ హెచ్ఎం డాక్టర్ నవీన్, సర్పంచ్ సమ్మక్క, ఏవో పరమేశ్వర్, సుహాసిని, ఏఈవో కార్తీక్, హెచ్ఈవో వేణు, హెచ్ఆర్ఎఫ్ స్వాతి తదితరులున్నారు.