Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
రాజ్యాంగానికి అతీతంగా కేసీఆర్ పాలన సాగించారని టీ జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ రత్నం కిరణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన ప్రజాస్వామ్యబద్దంగా సాగలేదని విమర్శించారు. కేటీఆర్ మంత్రిగా పని చేసిన మున్సిపల్ శాఖలో 2017లో ఒక్క జీవో అందుబాటులో లేదన్నారు. తుమ్మల నాగేశ్వర్రావు మంత్రిగా పని చేసిన రోడ్ల, భవనాల శాఖలో 8 జీవోలు మాత్రమే అందుబాటులో ఉంచారన్నారు. 2016లో 1951 జీవోలను కేసీఆర్ రహస్య జీవోలను అందుబాటులో లేకుండా చేశారన్నారు. 2017లో అయితే 11,918 జీవోలు రహస్యంగా ఉండబడ్డాయన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటివరకు 22వేల జీవోలను బహిర్గతం చేయలేదన్నారు. ప్రజలకు 42శాతం సమాచారం మాత్రమే అందించారని, మిగతా 58శాతం నిర్ణయాల జీవోల జాడే లేకుండాపోయిందన్నారు. 2014లో సచివాలయంలో పాలన సాగిన రోజుల్లో కేసీఆర్ సర్కార్ 10,283 జీవోలు ఇచ్చారని, ఆ జీవోలన్నీ అందుబాటులో ఉంచడం మాత్రమే జరిగిందన్నారు. 2015లో 21702 జీవోలు ఉండగా వాటిని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారని వివరించారు. 2016లో 23,115 జీవోలు ఇవ్వగా 13,164 జీవోలను బయటపెట్టి 9950 జీవోలను రహస్యంగా ఉంచారన్నారు. 2015లో 20,614 జీవోలు ఇవ్వగా 8696 జీవోలు బయటపెట్టి 11,918 జీవోలు రహస్యంగా ఉంచడం జరిగిందన్నారు. అంటే కేసీఆర్ పాలనలో జీవోల సంఖ్య విపరీతంగా పెరిగిందని, రాజ్యాంగానికి అతీతంగా పాలించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.