Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
భూపాలపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన వారికే పట్టం కట్టాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కొమ్ముల శివ పిలుపునిచ్చారు. మాజీ స్పీకర్ సిరికొండ గెలుపును కోరుతూ మండలంలోని కొత్తగట్టు సింగారంంలో శనివారం ఇంటింటా టీఆర్ఎస్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.టీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మరోసారి గెలిపిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తోట శరత్, బంధం సాంబయ్య, కిషన్, పరకాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిమ్మల మహేందర్, మాజీ సర్పంచ్ పోతు కృష్ణమూర్తి పాల్గొన్నారు.