Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భీమదేవరపల్లి
ప్రస్తుత రబీ పంటరుణం కోసం రెవెన్యూశాఖ ద్వారా అందించిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలు ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్ రైతులు అందజేయాలని ఆ బ్యాంక్ జనరల్ మేనేజర్ మార్పాటి రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అప్పు తీసుకునే రైతులు ఎరువుల స్లిప్లపై రూ. 4 వేల నుండి రూ.1 వెయ్యిలకు తగ్గించినట్లు తెలిపారు.గతంలో తీసుకున్న నార్మల్లోన్లపై 10శాతం తగ్గింపు చేసుకొని తిరిగి అప్పులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు సహకరించాలని కోరారు.