Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్దిపేట కలెక్టర్ కృష్ణభాస్కర్
నవతెలంగాణ-భీమదేవరపల్లి
ఓటర్లు స్వేచ్చగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ దేవరకొండ కృష్ణభాస్కర్ అన్నారు. మండలంలోని ముల్కనూర్ వెంకటసాయి గార్డెన్స్లో ఓటుహక్కుపై అవగాహనా సదస్సు శనివారం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును విధిగా ప్రతిపౌరుడు వినియోగించుకోవాలన్నారు. ఈవీఎంల ద్వారా ఓటు వేస్తే తాము వేసిన ఓటు వేరొకరికి వెళ్తుందని దుష్ప్రాచారమేనన్నారు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో తాము వేసిన ఓటును సరిచూ సుకోవడానికి వీవీప్యాట్లను భారత ఎన్నికలసంఘం ఏర్పాటుచేసిందన్నారు. ఓటువేసే సమయంలో ఏమైన ఇబ్బందులు ఉంటే అక్కడే ఉన్న ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదుచేయాలని సూచించారు. ఈవీఎంలపై దుష్ప్రాచారం చేసే వారిపై ఆరునెలల కఠిన కారాగార శిక్ష పడేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఓటు వేసే సమయంలో ఏమైన ఇబ్బందులు మోబైల్ ద్వారా పంపించాలంటే సివిజిల్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఈవీఎం, వీవీప్యాట్లలలో కొందరు మహిళలచే ఓటు వేయించి సరిచూపించారు. అనంతరం ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జాయింట్ కలెక్టర్ పద్మాకర్, హుస్నాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అనంతరెడ్డి, స్థానిక తహసీల్దార్ జగత్సింగ్, ఎంపీడీవో దేవి, ఆర్ఐ సదానందం, ముల్కనూర్, వంగర ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్కతుర్తిలో...
ఓటుహక్కు ప్రజల హక్కు అని, దాన్ని ప్రతి ఒక్కరూ వినియో గించుకోవాలని సిద్దిపేట కలెక్టర్ క్రిష్ణభాస్కర్ అన్నారు. శనివారం బస్టాండ్ కూడలి వద్ద రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటుహక్కు అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ఓటుహక్కును నూటికి నూరుశాతం వినియో గించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జేసీ పద్మనాభం, ఆర్డీవో అనంతరెడ్డి, సీఐ శ్రీనివాస్జి, తహసీల్దారు వెంకటరమణ, ఆర్ఐ శ్రీధర్, వీఆర్వోలు జాఫర్, స్నేహలత ఉన్నారు.