Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూటకో జెండా మారుస్తున్న నాయకులు
నవతెలంగాణ-మరిపెడ
డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలంలో టీిఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయాలు సినిమా ఫక్కీని తలపిస్తున్నాయి. శనివారం మండలంలోని నిలికుర్తి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మనోహర్నాయక్ ఉదయం కాంగ్రెస్ పార్టీలోకి రాంచంద్రునాయక్ ఆధ్వర్యంలో చేరారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తులుసుకున్న టీఆర్ఎస్ నాయకులు రంగంలోకి దిగారు. టీిఆర్ఎస్లోకి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, డీఎస్ రవిచంద్ర ఆధ్వర్యంలో మళ్లీ సాయంత్రం టీిఆర్ఎస్లో చేరారు. ఈ ఘటన మరిపెడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలు మాజీ ప్రజా ప్రతినిధులకు ఇరకాటం మారినట్టు మాజీ సర్పంచ్లు చర్చించుకుంటున్నట్టు తెలిసింది. ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చిన్న చందంగా పార్టీల కండువాల మార్పిడి కార్యక్రమం ఓటర్లను గందరగోళానికి గురిచేస్తోంది. ప్రజలు కూడా ఎవరిని నమ్మాలో తెలియక ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నారు.