Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
ఆదివాసీ చట్టాలు, హక్కులను అమలు చేసిన వారికే ఆదివాసీ తుడుందెబ్బ మద్దతు పలుకుతుందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఆ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హజరైన ఉపేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆదివాసీలను అణిచి వేస్తూనే ఉందన్నారు. పొలవరం పేరుతో 3 లక్షల మందిని నిర్వాసితులను చేసిందన్నారు. హరిత హారం పేరుతో ఆదివాసీల భూములపై పెత్తనం చెలాయిస్తూ లాక్కోవడానికి ప్రయత్నిస్తుందన్నారు. అటవీ హక్కుల చట్టం పేరుతో ఆదివాసీలపై కేసులు బనాయిస్తూ జైలు పాలు చేసిందన్నారు. పోరాడి సాధించిన తెలంగాణలో ఆదివాసీలకు హక్కులు లేకుండా పోయాయని తెలిపారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులు, చట్టాలను గౌరవించి మద్దతు తెలిపిన పార్టీలకే ఆదివాసీల ఓట్లు పడుతాయని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు రమణాల లక్ష్మయ్య, పొదెం రత్నం, దబ్బకట్ల సుమన్, రాంబాబు, కబ్బాక శ్రావణ్ కుమార్, చింత క్రిష్ణ పాల్గొన్నారు.