Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
మండలంలోని జూబ్లినగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు అనుచరులు తాజా మాజీ స్పీకర్, టీఆర్ఎస్ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో చిన్న మల్లయ్య, నగురపు ఓదెలు, ఓదెలు, జంగేటి కుమారస్వామి, మూలగుండ్ల శ్రీనివాస్రెడ్డి, సమ్మిరెడ్డి, క్రాంతి, అనిల్తో పాటు 50 మంది నాయకులు చేరగా సిరికొండ వారికి పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్టు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మోడెం ఉమేష్గౌడ్, నాయకులు పున్నం రవి, దాసరి నారాయణరెడ్డి, మటిక సంతోష్, లెంకల రాజిరెడ్డి, అయిలి శ్రీధర్, భలేరావు మనోహర్రావు, తదితరులు పాల్గొన్నారు.