Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
శాసనసభ ఎన్నికల నామినేషన్ స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు ఆర్డీవోలను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం భూపాలపల్లి, ములుగు ఆర్డీవోలు/ఎన్నికల రిటర్నింగ్ అధికారులైన వెంకటాచారి, రమాదేవి, డీఎస్పీలు రవికుమార్, విజయసారథిలతో సమావేశం నిర్వహించి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సందర్బంగా తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు నామినేషన్లు స్వీకరించాలని, నామినేషన్ పత్రాలను పూరించడంలో ఏమైన తప్పులు దొర్లితే అభ్యర్థికి తెలపాలని, ఏ రోజుకారోజు నామినేషన్ల వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలన్నారు. ఈనెల 11న ఈవీఎంల ర్యాడమైజేషన్ నిర్వహించాలని, త్వరలో జిల్లాకేంద్రంలో ఓటరు అవగాహనపై భారీ ర్యాలీ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బందికి ఇబ్బంది కలుగకుండా భోజనం, వసతి ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్, జేసీ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.