Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
మాల కులానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ఉన్న పల్లెలను గ్రామ పంచాయతీలుగా ఉన్నతీకరించి అభివృద్ధి చేయాలని బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు నరపోగు వెంకటేశ్వర్లు కోరారు. టీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావుకు ఈ మేరకు వినతిపత్రం అందించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పలు అంశాలు పొందుపర్చిన క్రమంలోనే మాల, మాదిగ కాలనీలను పంచాయతీలుగా చేస్తామంటూ ప్రకటించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గణేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాతంగి రాజు, తదితరులున్నారు.