Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
డిసెంబర్ 7న జరగనున్న శాసనసభ ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి ఈనెల 12 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ నియోజకవర్గానికి ఆర్డీఓ వెంకారెడ్డి, తూర్పు నియోజకవర్గానికి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గౌతం, వర్ధన్నపేటకు ఎస్డీసీ గణేష్ రిటర్నింగ్ అధికారులుగా నియమితులైనట్లు పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ అర్బన్ ఆర్డీఓ కార్యాలయంలో, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో, వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి అందజేయాలని సూచించారు.