Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుగ్గొండి
తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే అభివృద్ది చేసి చూపిస్తానని నర్సంపేట టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని ముద్దునూరు గ్రామంలో శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలను ఆదుకున్నాయని అన్నారు. ప్రభుత్వం ఫించన్లను రెట్టింపు చేస్తామని, ప్రతీ నిరుద్యోగికి ఆసరాగా నిరుద్యోగ భృతి అందిస్తామని హామినిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు మంచిపేరు వస్తుందని మాజీ ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడని మండిపడ్డారు. గత నాలుగేండ్లలో దొంతి చేసిందేమీలేదన్నారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తానని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమం ముద్దునూరు గ్రామంలో ప్రారంభమై మైసంపల్లి, జాఫర్పల్లి, స్వామిరావుపల్లి, గుడ్డెలుగులపల్లి, చంద్రయ్యపల్లి, మల్లంపల్లి, బొబ్బరోనిపల్లి, మర్రిపల్లి మీదుగా గోపాలపురం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆకుల శ్రీనివాస్, సుకినె రాజేశ్వర్రావు, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.