Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వతత్య్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-రేగొండ
ఆదరించి గెలిపిస్తే సేవకుడిగా పని చేస్తానని భూపాలపల్లి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రేగొండ, రావులపల్లి, పెద్దంపల్లి, గడిపల్లి, దుంపిల్లపల్లి, భాగిర్తిపేట గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు. తనపై కొంతమంది గిట్టని వారు అసత్యారోపణలు చేస్తున్నారని,తాను డబ్బుకు అమ్ముడుపోయేవాన్ని కాదని తెలిపారు. తన గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రజల ఆదరాభిమానాలు భరించలేకే పోటీలో ఉన్న అభ్యర్థులు తనపై అసత్య ప్రచారం చేస్తూ తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని, వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. మడమ తిప్పకుండా చివరి వరకు పోటీలో ఉండి మీ ఆశీర్వాదంతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుటోజు కిష్టయ్య, మ్యాకల బిక్షపతి, మోట్టే కిరణ్ పట్టెల్, రొంటాల సదయ్య, కోలెపాక సాంబయ్య, ఏనుగు రవీందర్, రాజు, రవీందర్, రమేష్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.