Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
హన్మకొండలోని నక్కలగుట్ట హరితహోటల్లో మంగళవారం ఉచిత ఆర్థోపెడిక్ వైద్యశిబిరాన్ని హైదరాబాద్కు చెందిన శ్రీకర హస్పటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దాదాపుగా ఉమ్మడి జిల్లా పలు ప్రాంతాల నుండి ట్రైసిటీలోని సుమారు 200 మందికి పైగా ఉచిత ఆర్థోపెడిక్ వైద్యశిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకర హస్పటల్స్ ఎండి డాక్టర్ అఖిల్ దాడి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా రోబోటిక్స్ టెక్నాలజీతో మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సను చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శ్రీకర హస్పటల్స్ నాలుగు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఒక హస్పటల్స్లో ఆర్థోపెడిక్ సేవలను అందిస్తున్నాయని తెలిపారు. రోబోటిక్స్ వలన అత్యంత ఖచ్చితత్వంతో, నమ్మకం కలిగే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థోపెడిక్ ఇబ్బందులు కలుగుతున్న పెషేంట్లకు ఎముక కోతను అవసరమైనంత మేరకే తీసుకోవడం జరుగుతుందని, ఈ శస్త్ర చికిత్స అనంతరం పెషేంట్ త్వరగా కోలుకొని రోజువారి పనులు చేసుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్లోని శ్రీకర హస్పటల్స్లో పాస్ట్ట్రాక్ అనస్తీషియా పద్దతిలో శస్త్ర చికిత్సలు చేసిన రోజునే పెషేంట్లను నడిపించడం జరుగుతుందని డాక్టర్ తెలిపారు. బయోనిక్గోల్డ్ ఇంప్లాంట్లతో 30 సంవత్సరాల కంటే ఎక్కువకాలం మన్నే ఆక్సీనియం మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలకు ప్రఖ్యాతిగాంచాయని తెలిపారు. రానున్న రోజుల్లో శ్రీకర హస్పటల్స్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు ఉచిత ఆర్థోపెడిక్ వైద్యశిబిరాలను నిర్వహించనున్నట్లు డాక్టర్ అఖిల్ దాడి తెలిపారు. ఈ వైద్యశిబిరంలో శ్రీకర హస్పటల్స్ ఆర్థోసర్జన్స్ అభిషేక్ బర్లి, డాక్టర్ ప్రవీణ్రెడ్డి, డా.రామ్కమల్, డాక్టర్ వినరు తదితరులు పాల్గొన్నారు.