Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
మండలంలోని అత్యధిక గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించి హవా కొనసాగించారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 13 మంది గెలిచారు. ఒకరు స్వతంత్ర అభ్యర్థి సర్పంచులుగా గెలుపొందారు. వేలేరులో కాగిత మాధవరెడ్డి, పీచరలో మేక రవీందర్, శాలపల్లిలో గుగులోతు మోహన్, షోడషపల్లిలో రాజేష్, బండతండాలో మాలోతు రాజు, చింతల తండాలో మాలోతు రాంచందర్, ఎర్రబెల్లిలో కవిత, గొల్లకిష్టంపల్లిలో సందెల పరమేశ్వరి, గుండ్లసాగర్లో ధర్మారెడ్డి, కమ్మరిపేటలో జోడుముంతల రమేష్, కన్నారంలో మల్లిక, లోక్యాతండాలో అనురాధ, మద్దెలగుడెంలో అంజమ్మ, మల్లికుదుర్లలో గోదాల రాజిరెడ్డి గెలిచారు. వీరిలో షోడశపల్లి అభ్యర్థి రాజేష్ స్వతంత్ర అభ్యర్థి మిగతా సర్పంచులు అందరూ టీఆర్ఎస్ బలపర్చిన వారే కావడం విశేషం.