Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నయీంనగర్
మంచి వ్యక్తిత్వం ఉంటే ఏ స్థాయికైన ఎదగవచ్చని గన్నోజు శ్రీనివాసాచారి నిరూపించారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ జాటోతు సంతోష్నాయక్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు, పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జి గన్నోజు శ్రీనివాసాచారి జన్మదినం పురస్కరించుకొని హన్మకొండ భవానీనగర్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ జాటోతు సంతోష్నాయక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం సంతోష్నాయక్ మాట్లాడారు. స్వశక్తితో ఎదిగిన వ్యక్తిగా శ్రీనివాసాచారిని అభివర్ణించారు. వ్యక్తిత్వమే ఆయన్ను పార్టీ జిల్లా అధ్యక్ష స్థాయికి తీసుకొచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు హన్మకొండ సాంబయ్య, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పోతరాజు అనిల్కుమార్, కాగితాల జయశంకర్, బోడా మోహన్బాబు, బానోతు వీరన్ననాయక్, మహేందర్, మచ్చ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.