Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
విద్యార్థులు తమలోని ప్రతిభను కనబర్చాలని పీహెచ్సీ డాక్టర్ మహేందర్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో జరుగుతున్న సైన్స్ ఫేర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్లబెల్లి పీహెచ్సీ డాక్టర్ మహేందర్ నాయక్ హాజరై సైన్స్ ప్రాజెక్టును పరిశీలించి మాట్లాడారు. చదువుతో పాటు తమ నైపుణ్యాన్ని కనబర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ ఏపీఎంవో డేవిడ్, పీహెచ్ఎన్ లీలా, ఏఎన్ఎం మాధవి, ఉపాధ్యా యులు లలిత, ప్రభావతి, శ్రీమాత, జ్యోతి, శృతి, అరుణ, మాధవి పాల్గొన్నారు.