Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ సుందరీకరణపై ఇంజినీర్లతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమీక్ష
నవతెలంగాణ-నర్సంపేట
35 కోట్ల రూపాయలతో చేపట్టనున్న నర్సంపేట పట్టణ సుందరీకరణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పురపాలక సంఘ కార్యాలయంలో మంగ ళవారం పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చైర్మన్ నాగెల్లి వెంకటనారా యణగౌడ్, వైఎస్ చైర్మన్ మునిగాల పద్మ వెంకట్రెడ్డి, కమిషనర్ ఎ వెంకటేశ్వరావు, కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నర్సంపేట పట్టణ సుందరీకరణ కోసం టీయూఎఫ్ఐడీసీ కింద మంజూరు చేసిన రూ.35తో చేపట్టాల్సిన వివిధ పనుల పురోగతిపై అడిగితెలుసుకున్నారు. 20కోట్లతో చేపట్టాల్సిన పనుల్లో కుమ్మరి కుంట పార్క్ కేటాయించిన రూ.4కోట్ల నిధులకు సంబంధించి టెండర్ల జాప్యానికి కారణం ఏమిటాని ప్రశ్నించారు. నాలుగు రోజుల్లో ఇట్టి పనులకు టెండర్లు పిలువాలని సూచించారు. టౌన్ హాల్, సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రూ. 15కోట్లతో కమ్యూటిహాళ్ల నిర్మాణాలను ప్రారంభించాలన్నారు. ఇప్పటి వరకు రూ.50లక్షలపై విలువజేసే కమ్యూనిటి హాళ్ల టెండర్లు పిలిచామని అవి కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకునే ప్రక్రియలో ఉన్నట్టు పబ్లిక్ హెల్త్ ఎస్ఈ భాస్కర్రెడ్డి తెలిపారు. మిగతా రూ.10లక్షల విలువచేసేవి త్వరలో టెండర్లను పిలుస్తామని చెప్పారు. నర్సంపేట పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రత్యేకంగా నాటి మంత్రి కేటీఆర్ సహకారంతో మొత్తం నిధుల సంబంధించి పనులను చేపట్టాలని ఎమ్మెల్యే పెద్ది ఇంజనీర్లను కోరారు. మున్సిపల్ పాలకవర్గం, కమిషనర్ సహకారం తీసుకుని సమన్వయంతో పనులు చేయాలన్నారు. పార్క్, కూరగాయల మార్కెట్, సెంట్రల్ లైటింగ్, డివైడర్, ఆరు ప్రదేశాలలో జంక్షన్ల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులను 3నెలల వ్యవధిల్లో పనులను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు గుంటి కిషన్, మండల శ్రీనివాస్, కాంట్రాక్టర్లు రాయిడి రవీందర్, కాప్టాన్, బజాజ్ ఏజన్సీ ప్రతినిధులు, ఎస్ఈ భాస్కర్రెడ్డి, డీఈ శ్రీనాధ్, ఏఈ సతీష్, టౌన్ బిల్లింగ్ ఇన్సిస్పెక్టర్ సునిల్ తదితరులు పాల్గొన్నారు.