Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేజర్ పంచాయతీ పీఠం ఎవరికి..?
- హోరాహోరీగా టీఆర్ఎస్, మహాకూటమి ప్రచారం
- సర్పంచ్ ఎన్నికల బరిలో నలుగురు
- తప్పని ద్విముఖ పోటీ
- కాంగ్రెస్ నేతల అలక
- టీఆర్ఎస్కు లాభం చేకూర్చేనా
నవతెలంగాణ-వెంకటాపురం
గ్రామాల్లో స్థానిక సమరం అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది.గ్రామాల్లో స్దానిక సమరం అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తుంది. సర్పంచ్ పీఠం కోసం స్థానిక నాయకులు పోటీ పడుతుండగా వందల సంఖ్యలో వార్డు సభ్యులు నెగ్గేందుకు ఉవ్విళ్లూరు తున్నారు. వార్డు సభ్యుల నుంచే ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఇంతకు ముందులా కాకుండా ఈ సారి ఉపసర్పంచ్కి సర్పంచ్తో పాటు సమానంగా చెక్కు పవర్ కట్ట బెట్టడంతో ఎలాగైనా వార్డుల్లో సత్తా చాటలని ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా వెంకటాపురం మేజర్ పంచాయతీల్లో టీఆర్ఎస్, మహాకూటమి ఆభ్యర్థుల మధ్య పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నువ్వా... నేనా...
వెంకటాపురం మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి బరిలో మహాకూటమి అభ్యర్థిగా చిడెం యామిలి, టీఆర్ఎస్ అభ్యర్థిగా పూనెం నాగలక్ష్మి, ఇండిపెండెంటుగా తుమ్మ నాగజ్యోతి, పూనెం వెంకటనర్సమ్మ పోటీలో ఉన్నారు. ముఖ్యంగా మహాకూటమి అభ్యర్థి, టీఆర్ఎస్ మధ్య ద్విముఖ పోటి ఉండే అవకాశం ఉంది. మహాకూటమి, టీఆర్ఎస్ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా పోటి చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య గెలుపొందారు. ఎన్నికలు పూర్తైన కొద్ది రోజులకే పంచాయతీ ఎన్నికలు రావడంతో ఇక్కడ టీఆర్ఎస్కు ఇవి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. పంచాయతీ ఎన్నికల్లొ అత్యధిక స్థానాలు గెలిచి తిరిగి పట్టు నిలబెట్టు కోవాలనే అక్ష్యంతో టీఆర్ఎస్ ముందుకు వెలుతుంది. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంలో ఉన్న మహాకూటమి అభ్యర్థులు అత్యధిక పంచాయతీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వెంకటాపురం సర్పంచ్ పీఠం కోస పోటీ నువ్వా.. నేనా అన్నట్టుగా ఇరువురు నాయకులు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రతికూలంగా మారనుందా
పంచాయతీ ఎన్నికల్లో వెంకటాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించారు. టీడీపీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుని కుటుంబానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిపారు. మహాకూటమి అభ్యర్థి తరుపున మండలాని కొందరు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రచారానికి దూరంగా ఉంటు అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దానికి తోడు సర్పంచ్ ఇండిపెండెంటు అభ్యర్థులుగా పోటీలో ఉన్న తుమ్మ నాగలక్ష్మి, పూనెం వెంకటనర్సమ్మలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడంతో ఎన్నో కొన్ని ఓట్లు రెబల్ అభ్యర్థులకు పోలయ్యే అవకాశం ఉంది. వెంకటాపురం మేజర్ పంచాయతీలో కాంగ్రెస్ నేతల అలకలు, రెబల్ అబ్యర్థుల పోటీ టీఆర్ఎస్కు ప్రతికూలంగా మారే పరిస్థితులు ఉన్నాయి. కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయకున్న తమకు వచ్చే నష్టం ఏమిలేదని ఎవరూ సహకరించకున్న గెలిచి తీరుతామనే ధీమాలో మహాకూటమి నాయకులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారంగా పంచాయతీలను కైవసం చేసుకుంటామని టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. దాంతో వెంకటాపురం పంచాయతీ పీఠం ఎవరిని వరించనుందో అనే ప్రచారం జోరుగా సాగుతుంది.