Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం కలెక్టర్ టీ వినరుకృష్ణారెడ్డి పాలకుర్తిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. ఈవీఎంలు భద్రపర్చేందుకు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ సిబ్బంది గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సామాగ్రిని స్ట్రాంగ్ రూంలో భద్రపర్చాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని, ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాలతి, తహశీల్దార్ డీ పుల్లయ్య పాల్గొన్నారు.