Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
ప్రాణికోటి జీవనాధారమైన నీటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని సుజాత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆకుతోట శాంతారాం కర్ణ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని సుజాత పాఠశాల పర్యావరణ మిత్ర యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం నీళ్ల ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సేవ్ ది వాటర్ ది వరల్ట్పై కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఆకుతోట కర్ణ మాట్లాడారు. భూమిపై ఉన్న వృక్ష, జీవ జాతులన్నీటికీ నీరే ప్రాణాధారం అన్నారు. నీటిని వృథా చేయడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఆకుతోట ఊర్మిళ, పర్యావరణ మిత్ర యూనిట్ ఆఫీసర్ గుండమీది కృష్ణమోహన్, ఉపాధ్యాయులు జయరాంకర్ణ, నాగరాజు, రవికుమార్ వెంకట్, ప్రవీణ్, వెంకటేశ్వర్లు, రాధాకుమారి, మానస, అరుణ, సబిత, ప్రసన్నలక్ష్మి, సంధ్య పాల్గొన్నారు.