Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
మహిళా చిరువ్యాపారులు వివిధ పథకాలపై రుణాలు పొందడానికి నేడు బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి తెలిపారు. ఈ నగరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కెనడా ఫండ్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్ పథకంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వివిధ గ్రామాలకు చెందిన 150 మంది చిరువ్యాపారి మహిళలు పాల్గొననున్నారని, కెనడా కాన్సుల్ జనరల్ నికొల్ గిరార్డ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారతీయ యువశక్తి ట్రస్ట్కి చెందిన మనోహర్ అలీఫ్ కోశాధికారి కవిత, ఎస్బీఐ మాజీ చీఫ్ మేనేజర్ కొండ నరేందర్ పాల్గొననున్నారు.