Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవ్పూర్
పెద్దపల్లి ఎంపీ టికెట్ బోర్లకుంట వెంకటేష్ నేతగానికి టీఆర్ఎస్ అధినేత టికెట్ ఇచ్చినందుకు తెలంగాణ నేతగాని కుల పర్యవేక్షణ సంఘం భూపాలపల్లి జిల్లా సంఘం నాయకులు గోగుల మదన్మోహన్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మహదేవ్పూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ కులాల్లో అట్టడుగు వర్గమైన నేతకాని కులాన్ని గుర్తించి రాజకీయంగా భవిష్యత్ ఇస్తున్న టీఆర్ఎస్ పార్టీ స్వతంత్య్రం వచ్చి 72సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్క పార్టీ నేతకాని కులస్తులను పట్టించుకోలేక కేవలం ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చూశారన్నారు. ఈ ఎన్నికలలో వెంకటేష్ నేతకానిని భారీ మెజార్టీతో గెలిపించాలని నేతకాని కులస్తులను కోరారు. ఈ సమావేశంలో కుదురుపల్లి ఉపసర్పంచ్ గోగుల లక్ష్మయ్య, నాగేందర్, మధు, సారయ్య, సమ్మయ్య, రమేష్, చిన్నమల్లయ్య, చిన్నలక్ష్మయ్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.