Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నియ మించిన కమిటీని రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రద్దు చేసి త్వరలో నూ తన కమిటీని ఎన్నుకోనున్నట్లు అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ కమిటీ అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. శక్రవారం మండల కేంద్రంలో జరిగిన అంబేద్కర్ యువజన సంఘాల సమావేశం వెంక టేశ్వ ర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్ర హ ప్రతి ష్టాపన కమిటీ రెండేళ్ల కాల పరిమితితో పాటు అంబేద్కర్ విగ్రహ ఏర్పా టులో జాప్యం జరుగుతున్నందున అంబేద్కర్ యువజన సంఘం తీర్మా నం మేరకు కమిటీని రద్దు చేసినట్లు తెలిపారు. త్వరలోనే అంబేద్కర్ యువజన సంఘం మండల నూతన కమిటీ, అంబేద్కర్ విగ్రహా కమి టీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, గోనె తిరుపతి, మైప లాలయ్య, బోడ రామచంద్రం, యంపెల్లి వీరస్వామి, బసా రికాని నాగార్జున, రాజమల్ల సుకుమార్, కరి శ్యాంబాబు, గంగెర్ల రాజారత్నం, మోదుగు బాబు తదితరులు పాల్గొన్నారు.