Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ఉపాధి కూలీలను ఆదుకోవాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ములుగు జిల్లా అధికార ప్రతినిధి కోడి సోమన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేవారు. శుక్రవారం ములుగు ఇన్చార్జి డీఆర్ఓ, ఆర్డీఓ కూతాటి రమాదేవికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ ములుగు పట్టణానికి చెందిన చాలా మంది పేదలకు జాబ్ కార్డులు రాలేదన్నారు. ఒక్కొక్క కూలికి వంద రోజులు కల్పిస్తున్నారని దానిని 200 రోజులకు పెంచాలన్నారు. వారం వారం కూలి డబ్బులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. గడ్డపారలు, పారలు అందిం చాలని, ఉపాధి కూలీ కనీస వేతనం చట్టం ప్రకారం రోజు కు రూ.500లకు పెంచాలని కోరారు. కొంత మంది ఫీల్డ్ అస ిస్టెట్లు అవకతవకలకు పాల్పడి కూలీలను మోసం చేస్తున్నారని తెలిపారు. పని చేయని వారు పేర్లపై పని చేసి నట్లు హాజరు వేసి తప్పుడు పద్ధతిలో డబ్బులు కాజస్తున్నారన్నారు. వేసవిలో కూలీలు వడదెబ్బకు గురి కాకుండా టెంట్లు వేయించాలని, వైద్య, మంచి నీటి సౌకర్యం కల్పిం చాలని కోరారు. కార్యక్రమంలో సమ్మయ్య, శ్యామల, రమేష్, మల్లమ్మ, రాజన్న, సరళ, ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు.