Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
భక్తుల గోవింద నామస్మరణతో కొడవటంచ లక్ష్మిన రసింహాస్వామి జాతర మారుమ్రోగింది. శుక్రవారం ఉదయం స్వామి వారికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు క్యూలైన్లో నిలబడి తమ మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ప్రాంగణంలో విడిది చేసి కోళ్లు, మేకలు బలిచ్చి బంధుమిత్రులతో విందులు చేసుకున్నారు. జాతర ఆవరణలో వెలిసిన దుకాణాలలో భక్తుల రద్దీ కన బడింది. మండలంలోని జోగయ్యపల్లిలో కనుకుంట్ల వంశ స్థులయిన విజేందర్ ఇంటి నుండి నరసింహాస్వామి పాదా లతో ప్రభ బండ్లు గురువారం రాత్రి ప్రారంభమై డప్పు చప్పుళ్లతో, మేళాతాళాల నడుమ ఊరేగింపుగా శుక్రవారం తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్నారు. వివిధ గ్రామాల నుండి భక్తులు ఏనుగు, మేక, గుర్రం వంటి ప్రభ బండ్లను తీసుకువచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిట్యాల సీఐ శ్రీనివాస్, రేగొండ ఎస్సై నాగపురి సదాకర్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి సింగరేణి పాఠ శాలలోని 40మంది విద్యార్థినీ, విద్యార్థులు జాతరలో భక్తులకు వలంటీర్లుగా తమ సేవలందించారు. రేగొండ పీహెచ్సీ వైద్యాధికారిణి మమతాదేవి ఆధ్వర్యంలో స్థానిక వైద్య సిబ్బందితో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి భక్తులకు సేవ లందించారు. ఈ కార్యక్రమంలో ఈఓ సీహెచ్.శ్రీనివాస్, మాజీ చైర్మన్ కొల్గూరి రాజేశ్వర్రావు, సర్పంచ్ పబ్బ శ్రీనివాస్, పూజారులు బుచ్చమాచార్యులు, శ్రీనివాసాచార్యులు, శ్రీధర్, సిబ్బంది శ్రీనివాస్, మహిపాల్, రవి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కులు చెల్లించుకున్న గండ్ర జ్యోతి
శ్రీ కొడవటంచ లక్ష్మినరసింహాస్వామికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు హాజరై శుక్రవారం మొక్కులు చెల్లించు కున్నారు. ఆలయంకు చేరుకోగానే పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు హింగే మహేందర్, సర్పంచ్ కుసుంబ రంజిత్ కుమార్, నాయకులు పబ్బ సమ్మయ్య, మాదాడి కర్ణాకర్రెడ్డి, మహేందర్, కోటి తదితరులు ఉన్నారు.