Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
అర్హులైన ప్రతి వికలాండు ఓటు హక్కు వినియో గించుకునేలా కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం మహబూబాబాద్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వికలాంగులకు కల్పిస్తున్న సౌక ర్యాలపై అంగన్వాడీ టీచర్లకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలోని రెండు నియో జకవర్గాల్లో 9672 అంధులు, చెవిటి, మూగ, అంగవైకల్యం, ఇతరులు ఉన్నారని చెప్పారు.