Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ రూరల్ జిల్లాలో 88.70 శాతం పోలింగ్
నవతెలంగాణ-నర్సంపేట
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ (ఎమ్మెల్సీ) వరంగల్ రూరల్ జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో యుటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయు అభ్యర్థిగా పూల రవీందర్, పీఆర్టీయు నుంచే పులి సరోత్తం రెడ్డి అనే అభ్యర్థి మరోకరు పోటీ చేశారు. శుక్రవారం ఆయా పోలింగ్ స్టేషన్ల సమీపంలో ఈ పోటీలో ఉన్న అభ్యర్థుల మద్దతుదారులైన ఉపాధ్యాయులు ఓటర్లను అభ్యర్థిస్తుండడం కన్పించింది. 16 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 805 మంది ఓటర్లకు గానూ 714 (88.70 శాతం)మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటుహక్కును ఉపయోగించుకున్నారు. ఇందులో పురుషులు 545 మంది, మహిళలు 169మంది ఓటేశారు. నర్సంపేటలో 227ఓటర్లకు గానూ 210 (92.51 శాతం) మంది ఓటును వినియోగించుకోగా, నెక్కొండలో 36 మందికి గానూ 34, ఖానాపురంలో 50మందికి 47, చెన్నారావుపేటలో 23 మందికి 20, నల్లబెల్లిలో 37మందికి 30, దుగ్గొండి 31మందికి 29, వర్థన్నపేటలో 36 ఓటర్లుండగా 23 మంది ఓటేశారు. రాయపర్తిలో 29 మందికి 23, పర్వతగిరి 14 ఓటర్లకు 11, గీసుగొండ 56 మందికి 52, దామెర 8మందికి ఏడుగురు, ఆత్మకూరు 30 మందికి 26, శాయంపేట 42 మందికి 31, నడికుడ 22 ఓటర్లకు 21, పరకాల 127 ఓటర్లకుగానూ 115 మంది, సంగెంలో 37కు 35మంది ఓటుహక్కును వినియోగించుకున్నట్టు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.