Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుమారు రూ.కోటి మోసం
- ఎస్సై మురళీధర్ రాజ్
నవతెలంగాణ-బయ్యారం
మండలంతోపాటు పరిసర మండలాల్లో ఓ ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ ఛానల్ రిపోర్టర్గా తనకు అధికారుల పరిచయం ఉందంటూ అందరినీ నమ్మించేవాడు. నాలుగేండ్ల కిందట ఇల్లందులో చీటింగ్ కేసులో అరెస్టయ్యాడు. 2015-2016లో బయ్యారానికి చెందిన రామాచారి నుంచి రూ.10లక్షలు, ఖమ్మంకు చెందిన వెంకటేశ్వర్లు నుంచి రూ.10లక్షలు, మహబూబాబాద్కు చెందిన బోశెట్టి ఐలయ్య నుంచి రూ.10 లక్షలు తీసుకున్నాడు. జూలూరుపాడులో భూమి కొంటే సింగరేణి బొగ్గు గనుల విస్తరణలో కోట్ల రూపాయాలు వస్తాయి అని నమ్మించాడు. కాగా ఎలాంటి భూమి కొనివ్వకుండా, డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. మండ్లపల్లికి చెందిన ఉపేందర్ నుంచి రూ.2.80 లక్షలు, బయ్యారానికి చెందిన సంపత్ నుంచి రూ.4 లక్షలు తీసుకుని ఫ్లాట్ ఇస్తానని చెప్పి మోసగించాడు. కారేపల్లికి చెందిన అన్నపూర్ణ టీచర్ నుంచి భార్య భర్తల సమస్యను పరిష్కారం చేస్తానంటూ రూ. 6.50 లక్షలు తీసుకున్నాడు. సమస్య పరిష్కరించకపోవడంతో డబ్బులు ఇవ్వమని అడిగితే కులం పేరుతో ధూషించి, డబ్బులు అడిగితే చంపేస్తానంటూ బెదిరించాడు.